చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి వైద్యుడిని కాల్చి చంపిన యువకులు

Oct 3, 2024 - 21:05
 0  4
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి వైద్యుడిని కాల్చి చంపిన యువకులు

చికిత్స పేరుతో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వైద్యుడిని కాల్చి చంపారు. ఢిల్లీ జైత్‌పూర్ ప్రాంతంలోని నీమా ఆసుపత్రిలో నిన్న జరిగిందీ ఘటన. వైద్యుడిని జావేద్‌గా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు యువకులు ఆ తర్వాత డాక్టర్ జావేద్‌ను కలవాలని అభ్యర్థించారు.

వారు ఆయన క్యాబిన్ ‌లోకి వెళ్లిన వెంటనే తుపాకితో జావెద్‌పై కాల్పులు జరిపి పరారయ్యారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333