గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ
కాంగ్రెస్ పార్టీలో చేరిన చాగాపురం యువత
సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారీ ఎత్తున గ్రామ గ్రామాన చేరికలు .
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి ; అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో పరశురాముడు అనే అతనితోపాటు 40 మంది కార్యకర్తలు ఈరోజు శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల మండలాధ్యక్షులు రుకుమానందరెడ్డి మరియు ఇటిక్యాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు చాందు, లింగన్న, అల్లా బాకస్, ఆంజనేయులు, గొల్ల రామకృష్ణ, గోవర్ధన్,తదితరులు ఉన్నారు.