సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు
అడ్డగూడూరు 26 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరదిలోని గోవిందపురం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సెయింట్ విన్సెంట్ పల్లోటి హై స్కూల్ ప్రధానో పాధ్యాయురాలు సెల్వి జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.అనంతరం అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా డ్రగ్స్, మద్యపానం, ధూమపానం,సెల్ ఫోన్ ల వల్ల కలిగి అనర్ధాలను వివరిస్తూ..సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు ఎఎస్సై ఈశ్వర్,పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, సెయింట్ విన్సెంట్ పల్లోటి హై స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.