ఝాన్సీ రెడ్డి ని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

Oct 3, 2024 - 21:24
Oct 3, 2024 - 21:27
 0  5
ఝాన్సీ రెడ్డి ని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

తొర్రుర్ 03 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో గురువారంరోజు కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన వేదిక ఒకసారిగా కూలడంతో ఝాన్సీ రెడ్డి కాలు విరగడంతో బలమైన గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులో గల అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝాన్సీ రెడ్డిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఝాన్సీ రెడ్డిని పరామర్శించారు.ప్రమాద వివరాలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝాన్సీ రెడ్డిని పరామర్శించేందుకు పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఝాన్సీ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఝాన్సీ రెడ్డిని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,కమిషన్ సభ్యులు బండా సుధీర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య,పిసిసి రాష్ట్ర కోఆర్డినేటర్,కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జ్ మొగుళ్ళ అశోక్ గౌడ్,బొబ్బల రమణారెడ్డి, రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,నాగార్జున రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతిరెడ్డి, తొరూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్, గంజి ప్రసాద్ రెడ్డి,దేశగాని నాగరాజు,మేకల కుమార్, సుంచు సంతోష్, లతోపాటు నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి ఝాన్సీ రెడ్డిని పరామర్శించారు.