**షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన""సూర్యాపేట షీ టీమ్స్*
తెలంగాణ వార్త ప్రతినిధి:: *షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన*
*సూర్యాపేట షీ టీమ్స్*
*ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు*DSP ప్రసన్న కుమార్ గారి సూచనలతో సూర్యాపేట షీ టీమ్స్ మహిళా SI నీలిమ గారు*సూర్యాపేట మండల కేంద్రంలోని స్వామి నారాయణ గురుకుల్ లో కెపాసిటి బిల్డింగ్ టీచర్ ప్రోగ్రాం సందర్భం గా షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపైన,POSH 2013 Act గురించి ,పోలీసు కళాభృందంతో టీచర్స్ కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది*
*సూర్యాపేట షీ టీమ్స్ WSI నీలిమ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో,DSP ప్రసన్న కుమార్ గారి సూచనలతో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.*
*ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు*
*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* *అతిక్రమించొద్దు అని అన్నారు.*
*యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన* *తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు.* *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు*
*అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో టీచర్స్ కి అవగాహన* *కల్పించారు* .
*ఈ కార్యక్రమం లో DEO అశోక్,DRP లు దేవరాజు,క్రాంతి,ఉపేంద్ర,లక్ష్మీనారాయణ, షీ టీం హెడ్ కానిస్టేబుల్ కవిత, మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, ఉమామహేశ్వరి, కళాబృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, నాగార్జున, చారి, క్రిష్ణ , గురులింగం,మరియు టీచర్స్ పాల్గొన్నారు.*