రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్ధివ దేహానికి పూలమాల వేసి

నివాళులు అర్పించిన  KT దొడ్డి ఎస్సై శ్రీనివాస్ మరియు సిబ్బంది

Sep 19, 2024 - 19:31
Sep 19, 2024 - 19:31
 0  6
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్ధివ దేహానికి పూలమాల వేసి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్ధివ దేహానికి పూలమాల వేసి

జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నిన్న నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన KT దొడ్డి పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్  అదేశాల మేరకు KT దొడ్డి ఎస్సై శ్రీనివాస్  తన సిబ్బంది తో కలిసి వారి స్వగ్రామం అయిన పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో పూలమాల చేసి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.


    ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ.. 2020లో పోలీసు శాఖలో నియామకమై   సేవలను అందించారని, శ్రావణి మరణం వారి కుటుంబానికే కాకుండా జిల్లా పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు. అంత్యక్రియ ఖర్చులకు గాను 20,000/- రూపాయల నగదును అందజేసి వారి తల్లిదండ్రులను ఎస్సై  ఓదారుస్తూ వారికి అన్ని విధాలుగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333