రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్ధివ దేహానికి పూలమాల వేసి
నివాళులు అర్పించిన KT దొడ్డి ఎస్సై శ్రీనివాస్ మరియు సిబ్బంది
జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నిన్న నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన KT దొడ్డి పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ అదేశాల మేరకు KT దొడ్డి ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బంది తో కలిసి వారి స్వగ్రామం అయిన పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో పూలమాల చేసి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. 2020లో పోలీసు శాఖలో నియామకమై సేవలను అందించారని, శ్రావణి మరణం వారి కుటుంబానికే కాకుండా జిల్లా పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు. అంత్యక్రియ ఖర్చులకు గాను 20,000/- రూపాయల నగదును అందజేసి వారి తల్లిదండ్రులను ఎస్సై ఓదారుస్తూ వారికి అన్ని విధాలుగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలియజేశారు.