రైతుభరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..!!!!!!
రైతుభరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగుయోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతుభరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది