మానవత్వంతో మూగజీవాన్ని కాపాడిన రిపోర్టర్
నాగారం జూలై 27:- గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలై పత్తి చేనులో పడి ఉన్న మూగజీవం నక్కను శనివారం ఉదయం గుర్తించిన స్థానిక రిపోర్టర్ వంగూరి అంజి మానవత్వంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి వారు వచ్చేంతవరకు దానిని కాపాడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మురళి వాచ్ ఆఫీసర్ వెంకన్నకు నక్కను అప్పజెప్పారు.అనంతరం మూగజీవాన్ని సూర్యాపేటకు తరలించి శాస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. వారి వెంట పోలీస్ కానిస్టేబుల్స్ వీరన్న ఎల్లయ్య శేఖర్ తదితరులు ఉన్నారు.