మాజి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమి రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

Apr 27, 2024 - 20:19
 0  24
మాజి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమి రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

 సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భూమ్ రెడ్డి, ఎంపీటీసీలు ఇతర మాజీ చైర్మన్లు కాంగ్రెస్లో చేరిక 

తెలంగాణ వార్త కొండపాక: మాజీ సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గం లోని కొండపాక మండలానికి చెందిన పలువురు నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి తోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి కొండపాక మండలానికి చెందిన ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా, మర్పడగ ఎంపిటిసి ఆంజనేయులు, పిఎన్ఆర్ సంస్థ చైర్మన్ కుకునూరుపల్లి సర్పంచ్ భర్త పోల్కంపల్లి నరేందర్, కుకునూరుపల్లి మాజీ ఎంపీటీసీలు తూము మహేందర్, ఇండ్ల కనకయ్య, ముద్దపూర్ శ్రీకాంత్ రెడ్డి, వెంకటరెడ్డి లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి వెంట డిసిసి అధ్యక్షులు తూముకుంట నరసారెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ సురేందర్ చారి కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగారావు కుకునూరుపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి మల్లేశం కనక రాములు తదితరులు ఉన్నారు. కాదా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు శుక్రవారం రాత్రి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిలను కలిసి చర్చలు జరిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333