మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దు

తిరుమలగిరి 06 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలోని గుండెపురి గ్రామపంచాయతీలో నిర్వహించిన కళాజాత సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు మత్తుకు బానిసలు కవద్దు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని అన్నారు.తల్లిదండ్రులకు భారం కావద్దు భరోసా కావాలి అంటూ మాట్లాడినారు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పాన్ మసాలా గుట్కా సారా నిషేధం పైన ప్రజలకు కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు