బొగత జలపాతంలో యువకుడు మృతి

Jul 23, 2024 - 20:01
 0  18
బొగత జలపాతంలో యువకుడు మృతి

వాజేడు జూలై 23 తెలంగాణ వార్త:- ములుగు జిల్లా వాజేడు మండల చికుపల్లి బోగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన స్నేహమిత్రులైన సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ గౌస్ తో కలిసి సహజ సిద్ధమైన బొగత జలపాతాన్ని తిలకించడానికి వచ్చారని, స్నానం ఘాటు వద్ద స్థానం చేస్తుండగా వరద ఉదృతంగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంతయ్యాడని వెంకటాపురం సీఐ బండార్ కుమార్,వెంకటాపురం ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా… యువకుడి మృతదేహం లభ్యమైనది. ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333