అరుదైన శస్త్ర చికిత్స చేసిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ 30 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ ఎల్బీనగర్ అలకపూరి రాక్ టౌన్ లో గల పవన్ సాయి హాస్పిటల్ నందు మోత్కూర్ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీ కి చెందిన జిట్ట బిక్షం(60) సంవత్సరాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడి పక్కటేముకలు విరిగి తీవ్రంగా గాయపడగా పవన్ సాయి హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసిన ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ..గత 15సంవత్సరాలుగా ఇది చాలా అరుదైన శస్త్ర చికిత్స అని తెలిపారు.చాలా నిరుపేద కుటుంబానికి భరోసా కల్పించి ఈ రోజుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తూ పేదలకు ఎప్పడు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి పలువురు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతూ నిండు ప్రాణాన్ని నిలబెట్టిన తనకి జీవితాంతం ఋణపడి ఉంటామని కంటతడితో బాధితుడు తెలిపారు.