విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన - మల్లు రవి..

Jun 21, 2024 - 17:53
 0  5
విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన - మల్లు రవి..

- బిసి బాలికల వసతిగృహం సందర్శించిన....

- నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...

- జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...

జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బి.సి.బాలికల వసతిగృహాన్ని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ తో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి సందర్శించారు... జిల్లా బి.సి.వెల్ఫేర్ అధికారులతో పాటు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు,భోజన శాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు..అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు మల్లు రవి చేతులమీదుగా అందజేసినారు... వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమస్యలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని అధికారులకు సూచించారు...
ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకుడు గంజిపేట్ శంకర్,ధరూర్ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333