బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ పట్టణంలో అంబేద్కర్ చౌక్ దగ్గర విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక టైరు కృష్ణయ్య కాలు పై ఎక్కించగా పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.