ప్రజావాణికి 46 ఫిర్యాదులు
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించగా, అట్టి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.