పిఆర్సి అమలయ్యే వరకు నిరసనలు.
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూఎస్పిసి పిలుపు మేరకు భోజన విరామ సమయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిఆర్సి అమలు చేసే వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం బాగుంటన్న కరుణాకర్ హనుమంతు పాల్గొన్నారు.