పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేత

తిరుమలగిరి 21 ఆగస్ట్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా వుంచుతున్న పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు అందజేసిన మున్సిపల్ కమీషనర్ మున్వర్ అలీ . ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచిన కార్మికులు వర్షంలో తడిసి జ్వరం బారినపడకూడదని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు అందజేశమన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శోభ, వార్డు ఆఫీసర్లు,మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు