పదవ తరగతి పరీక్ష కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

Mar 21, 2024 - 21:08
 0  6
పదవ తరగతి పరీక్ష కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన

పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా మౌలిక వసతులు సరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డి ఏ వి మోడల్ స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ ను ఆకస్మికంగా సందర్శించి పరీక్ష వ్రాయు విధానము సరళిని పరిశీలించారు.

 పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా కలెక్టర్ చీఫ్ సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీలు జరగకుండా  బాధ్యులు పర్యవేక్షించాలని ఇన్విజిలేటర్స్ ను ఆదేశించారు. ఇన్విజిలేటర్స్ ఎటువంటి పొరపాట్లు కు తావు లేకుండా విధులు నిర్వహించాలని ఏదైనా పొరపాట్లు జరిగిన యెడల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.విద్యార్థులకు కల్పించే మౌలిక సదుపాయాలు పరిశీలించారు. పరీక్ష హాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు మరియు త్రాగునీరు అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ ఫోన్లు అనుమతించరాదని, పరీక్ష కేంద్రం సమీపంలో ఇటువంటి జిరాక్స్ సెంటర్లో ఉండరాదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ప్రతిష్టంగా అమలు పరచాలని సంబంధిత పోలీసు అధికారులను కలెక్టర్ సూచించారు.

  ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఏ ఒక్కరూ కూడా సెల్ ఫోన్ తో పరీక్ష కేంద్రంలోకి రాకూడదని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, పాల్వంచ తాసిల్దార్ జి. వివేక్ మరియు పాల్వంచ మునిసిపల్ కమిషనర్ స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333