నూతన దేవాలయానికి విరాళంగా 50వేలు ఆర్థిక సాయం టిపిసిసి రాష్ట్ర చామల కిరణ్ కుమార్ రెడ్డి

Feb 27, 2024 - 17:54
 0  24
నూతన దేవాలయానికి విరాళంగా 50వేలు ఆర్థిక సాయం టిపిసిసి రాష్ట్ర చామల కిరణ్ కుమార్ రెడ్డి

 శాలిగౌరారం 27 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాధేశ్వర స్వామి దేవస్థానానికి 50 వేలు రూపాయలు విరాళం అందించిన టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం గురజాలలోని శ్రీఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాధేశ్వర స్వామి స్వామివారిని ఆలయాన్ని దర్శించుకుని నూతన ఆలయ నిర్మాణానికి 50 వేల రూపాయలు విరాళాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిర్మాణంకి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆలయ కమిటీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సాలువ కప్పి సన్మానించారు.


     ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి మార వేణుగోపాల్ రెడ్డి, ఎంపిటిసి నక్క శంకరమ్మ -మల్లేష్,మాజీ ఎంపిటిసి కోక యాదయ్య ,మాజీ సర్పంచి గూని మల్లయ్య మాజీ  ఉప సర్పంచి ఖమ్మంపాటి వీరయ్య,మరియు అడ్వకేట్ యుగంధర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333