పొలాలకు నీళ్లు ఇవ్వకుంటే మేమే గేట్లు ఎత్తుతాం అని రంగంలో దూకిన రైతులు

Feb 27, 2024 - 17:58
 0  2

ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత. పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టిన పాలేరు నియోజకవర్గం రైతులు. పాలేరు పాతకాలం కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల పొలాలను కాపాడాలంటూ రైతుల నినాదాలు. సాగునీరు విడుదల చేసేంతవరకు వెళ్ళేది లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయింపు. అధికారులు స్పందించకపోవడంతో పాలేరు లాకులు ఎత్తి నీటిని విడుదల చేసిన రైతులు. అడ్డుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు. రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం. 20వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నదాతల ఆగ్రహం. గతంలో రెండు సార్లు విజ్ఞప్తి చేసిన కనీసం స్పందించలేదని అధికారులపై మండిపడ్డ రైతులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333