తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం

Sep 22, 2024 - 20:13
Sep 22, 2024 - 23:13
 0  4
తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం

తెలంగాణ వార్త నూతనకల్:- తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం నూతనకల్.. 15 ఏళ్లుగా తమతో పాటు జర్నలిస్టుగా పనిచేసిన తోటి జర్నలిస్టు బోయిల చంద్రశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తోటి జర్నలిస్టు లు విరాళాలు సేకరించి 108,000 వారి కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఆత్మకూర్ ఎస్ మండలం నమస్తే తెలంగాణ జర్నలిస్టుగా పనిచేసిన నూతనకల్ గ్రామానికి చెందిన బోయిల్ల చంద్రశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ మండలానికి చెందిన తోటి జర్నలిస్టులు దాతలు సహకారం తీసుకొని ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు నగదు నూతనకల్లోని చంద్రశేఖర్ కుటుంబానికి అందజేశారు. 15 నెలలకు పనిచేసి పత్రిక పరంగా మండలంలోని ప్రజలకు సేవలు అందించారని చంద్రశేఖర్ సేవలను కొనియాడారు . శేఖర్ కుటుంబానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు జలగం మల్లేష్ జంగా జానయ్య మడ్డి మల్లేష్ సుందర్ ఎరుకల సైదులు మేడి కృష్ణ జిల్లా రాములు జుజ్జురి సైదులు స్థానిక జర్నలిస్టులు మాజీ ఎంపీపీ మల్లారెడ్డి పాల్గొన్నారు.