తిరుమలగిరి లో మంత్రాల నేపంతో వ్యక్తి పై దాడి

Oct 4, 2024 - 08:17
Oct 4, 2024 - 12:26
 0  440
తిరుమలగిరి లో మంత్రాల నేపంతో వ్యక్తి పై దాడి

తిరుమలగిరి 04 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ని బీసీ కాలనీ చెందిన వ్యక్తిపై మంత్రాలు  చేస్తున్నాడానే నేపంతో నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పీట్ల పరశురాములు ఇంట్లో పూజలు చేసుకుని బహిర్భూమి వెళ్లి వస్తుండగా కాలనీ చెందిన వేముల యాదమ్మ, రాములు, శంకర్, రాజు లు కలిసి పరశురాములు ను స్తంభానికి కట్టివేశారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరశురాములు తీసుకెళ్లారు. పరశురాములు ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎస్సై సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన కాలంలో మూఢనమ్మకాలను ఎవరు నమ్మొద్దని, ఇలాంటి సంఘటనకు పాల్పడితే కేసులు అవుతాయని హెచ్చరించారు. త్వరలో కాలనీలో మూఢనమ్మకాలపై కళాజాత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034