తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో

తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు మంగళవారం పరిశీలించారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తహాసిల్దార్ కార్యాలయ సిబ్బందిని అదేసిoచారు. నేడు మున్సిపాలిటీ లో చైర్మన్ పోతరాజు రజిని పై జరిగే అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహాసిల్దార్ జాన్ మహమ్మద్ సిబ్బంది ఉన్నారు.