గొట్టుముక్కుల పద్మారావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పట్నం మహేందర్ రెడ్డి

Apr 8, 2024 - 19:38
 0  12
గొట్టుముక్కుల పద్మారావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ వార్త, ఏప్రిల్ 08 : మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యులు, పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం సీనియర్ రాజకీయ నాయకులు  గొట్టుముక్కుల పద్మారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా పద్మారావును ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి  గొట్టుముక్కుల పద్మారావు సానుకూలంగా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ భేటీలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, జరుగుతున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పిశెట్టి దినేష్, మేకల మైఖేల్, మహిళా నాయకురాలు  దుర్గారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333