లబ్ధిదారులకు రు.500 సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ
వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు
ఎఐసీసీ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్యే డా౹౹ ఎస్ ఏ సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలంలోని తనగల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని గ్రామపంచాయతీ నందు మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగ్ దొడ్డి ఉప్పరి దొడ్డప్ప, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఆర్డీఎస్ ఎక్స్ చైర్మన్ సీతారాం రెడ్డి గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉప్పరి దొడ్డప్ప, పచర్ల కుమార్, డైరెక్టర్ సులోచనమ్మ, డైరెక్టర్ రంగస్వామి గారు ప్రమాణస్వీకారం చేసి తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన సందర్భంగా వారిని పూలమాల శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీపతి, రవి గౌడ్, సుందర్ రాజ్, చాకలి వీరేష్,మహేష్, చిన్న రాముడు, రత్నమయ్య, భీముడు, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ కాంతు, లబ్బిదారులు, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.