గీత కార్మికుడు మృతి సంతాపం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు

Mar 17, 2024 - 19:58
 0  288
గీత కార్మికుడు మృతి సంతాపం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు

తిరుమలగిరి 18 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం గుండెపురి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాలకుర్తి వెంకన్న ప్రతిరోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడు వెంకన్నకు ఒక కుమార్తె. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి కాగా గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.. మృతుని కుమార్తెకు ఈనెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది .

సంతాపం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు

మండలంలోని గుండెపురి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాలకుర్తి వెంకన్న మృతి పట్ల తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెపురి ఎంపిటిసి దారావత్ జుమ్మిలాల్ నాయక్. మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, తిరుమణి యాదగిరి, యూత్ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డు బాలకృష్ణ, మాజీ ఎంపిటిసి రమేష్, సోమయ్య , కృష్ణ నాయక్ తదితరులు మృతుని పార్దివ దేహం పై పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034