కార్ఖానా సిసి రోడ్డును చిరకాల వాంఛ నెరవేర్చిన
ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

అడ్డగూడూరు 19 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని కార్ఖానా ఎస్సీ కాలనీలో ఎన్నో రోజులుగా మట్టి రోడ్డు గుంతల మయంతో ఉండడం ప్రజలకు రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఇట్టి విషయాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్యే వెంటనే రోడ్డును మంజూరు చేశారు. టిపిసీసీ రాష్ట్ర నాయకులు బాలెంల సైదులు మాట్లాడుతూ.. గత పాలకులు దశాబ్దాలుగా పాలించి ఎన్నో ఏళ్ల నుండి ఉన్న మట్టి రోడ్డు ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోలేదు ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే సామేల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే తక్షణమే ఈ రోడ్డు మంజూరు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే సామేలుకు కార్ఖానా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కురాకుల యాదగిరి,గోలి రాంరెడ్డి,గుత్త వినోద,మాజీ ఎంపీటీసీ గుడెపు యాదగిరి,మహిళా మండలి నాయకురాలు దాసరి వీరలక్ష్మి, పసునూరి లక్ష్మి,మెతుకు ముత్తమ్మ, ఆసర్ల బీరుమల్లు,పెద్ద గూడెపు యాదగిరి,డప్పు మల్లేష్,తాళ్లపల్లి పున్నం,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్, బాలెంల నరేష్ డప్పు వెంకన్న,భయ్య బిక్షం, నారబోయిన లింగస్వామి, కొక ఉమేష్,బాలెంల మహేందర్,బండ నరేందర్,పొలెపాక ఉపేందర్, బాలెంల జీవన్,ఊడుగు మల్లేష్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు పెరుమాండ్ల నిఖిల్ ప్రజలు కాలనీవాసులు పాల్గొన్నారు