స్థలాన్ని సాధించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే
సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు
జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కోర్టు సముదాయ నిర్మాణానికి కావాల్సిన అనువైన స్థలం సాధించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావు అన్నారు. పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్యల మద్దతు ఉంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా నిరసన కార్యక్రమాలకు మొదటి నుండి అండగా నిలిచిన మోహన్ రావు కి గద్వాల బార్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉన్నారు.