కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం..

Apr 15, 2024 - 19:49
 0  5
కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం..

సూర్యాపేట: కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల  ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని వాణిజ్య భవన్ సెంటర్  లో  సోమవారం  మజ్జిగ పంపిణీ కేంద్రం ను  ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధి బిజెపి సీనియర్ నాయకులు జుట్టు కొండ  సత్యనారాయణ   వారి కుటుంబ సభ్యులు హాజరై ప్రారంభించారు.ఈ  సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి రంగయ్య జ్ఞాపకార్థం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లే వారికి మరియు పాదాచారులకు  భగ్గు మంటున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని  ఎండాకాలం ప్రజల దాహం తీర్చడానికి  నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం లో ఉండే విధంగా  మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని  వాణిజ్య భవన్ సెంటర్ లో ఏర్పాటు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో  కర్నాటి కిషన్, కర్నాటి రామ్మూర్తి, కర్నాటి సుధాకర్ ,అల్లుడు బిడ్డ కక్కిరేణి పృథ్వి కుమార్, స్వాతి,గుండా వెంకన్న,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333