ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు టీచర్లకు అవార్డులు.
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ మండలం. చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన ముగ్గురు టీచర్లు బెస్ట్ టీచర్స్ అవార్డులకు ఎంపిక అయ్యారు. ఐజ మండలము ఉత్తనూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్న శ్యామ్ సన్, భూంపురం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్న మొహమ్మద్ రఫీ అలాగే గద్వాల మండలంలో మెల్ల చెరువు గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న షేక్షావలి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. దీంతో ఆయా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నేడు గద్వాలలో అవార్డులు అందుకున్నారు.