ఐకెపి కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
తిరుమలగిరి 01 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం లోని రాజన్న కొక్య నాయక్ తండా మరియు తొండ గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిర్ డి వో, డి సీ ఎస్ వో తహసీల్దార్ తో కలిసి వర్షం వలన తడిసిన ధాన్యము రాశుల ను పరిశీలించి నారు, తడిసిన ధాన్యము మరియు తేమ శాతం వచ్చిన ధాన్యం ను వెంటనే కాంటాలు వేసి మిల్లు శ్రీ సాయిరాం రైస్ మిల్లు సూర్యాపేట కు పంపవలసినదిగా ఆదేశించారు వీరి వెంట పీడీ అప్పారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహనబాబు, పంచాయతీ అధికారి యాదగిరి తహసీల్దార్ హరిప్రసాద్ ఏవో నాగేశ్వర్ రావు, ఎంపీడీఓ లాజర్ సీసీ నాగయ్య జీపీవో మధుసూదన్, నాగలక్ష్మి డీటీ లు రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి లతో నిర్వాహకులు పాల్గొన్నారు