ఇందూరు వెంకన్న కుటుంబాన్ని లేబర్ అధికారులు ఆదుకోవాలి

May 8, 2024 - 19:58
May 8, 2024 - 20:03
 0  6
ఇందూరు వెంకన్న కుటుంబాన్ని లేబర్ అధికారులు ఆదుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- ఇందూరు వెంకన్న కుటుంబాన్ని లేబర్ అధికారులు ఆదుకోవాలి బొప్పరం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి ఇందూరి వెంకన్న ఈరోజు తన స్వగ్రామంలో మృతి చెందాడు ఆయన భౌతిక ఆయనకి తెలంగాణ ప్రగతిశీల పవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు గంటా నాగయ్య, పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐఎఫ్ టి యు జెండాని భౌతికయంపై ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంచనపల్లి సైదులు కప్పారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేకమంది గుండెపోటు వడ దెబ్బ తదితర అనారోగ్యాలకు గురై చనిపోతున్నారని వీరిని లేబర్ అధికారులు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ఆదుకోవాలని కోరారు. వేసవిలో భవన నిర్మాణ కార్మికుల పనులు చేస్తున్న చోట సౌకర్యాలు కల్పించాలని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తాపీ మేస్త్రి కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గడ్డ ఉపేందర్, సిద్ధల చంటి, బొజ్జ సతీష్, ముత్యాలు, వెంకన్న, అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర ఉమేష్, సుధాకర్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు