ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేత
తిరుమలగిరి 09 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామ అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఆర్ అండ్ బి కార్యాలయంలో హెడ్ చీఫ్ ఇంజనీర్ మధుసూధన్ రెడ్డి కు దరఖాస్తు అందించిన తొండ గ్రామ అభ్యుదయ కమిటీ సభ్యులు ముక్కెర మహేష్ నీరటి ప్రవీణ్ ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కు దరఖాస్తు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు..