శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆహ్వానం
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈనెల 8 నుండి 15 వరకు జరిగే సప్తాహ భజన కార్యక్రమానికి శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనసప్తహకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహల్లాదరావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు హాజరై సప్తాహ భజన ప్రారంభిస్తారని తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమానికి భక్తులు గ్రామస్తులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.