-శ్రీ కృష్ణ స్వామి దేవస్థానంనందు అన్నదాన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 25 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ మండల పరిధిలోని సద్దలోని పల్లి గ్రామంలోశ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నందు నేడు అమావాస్య సందర్భంగా దేవాలయ సన్నిధానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో పురేందర్ ఆధ్వర్యంలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని భావించి భక్తులకు సహకా రంతో ప్రతి అమావాస్య ప్రతి శనివారం రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు అన్నదాత : సద్దలోని పల్లి గ్రామానికి చెందిన నివాసి, తిప్పి గొండోలు గోత్రం గుడిసె రామ గోవిందు తండ్రి గుడిసె ఎర్రన్న లు స్వామివారికి ఇచ్చిన మొక్కులుచెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ స్వామి పూజారి అర్చకులు, పూజారి కృష్ణయ్య మరియు పూజారి పాండురంగ స్వామి అన్నదాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.