మల్దకల్ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన పాఠశాల యాజమాన్యం
జోగులాంబ గద్వాల 25 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. కేంద్రంలో ఉన్న న్యూ ట్రినిటీ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్ ఎక్కువ ధరకు అమ్ముతున్న సమాచారాం తెలియడంతో ఎంఈఓ అక్కడికి చేరుకొని పరిశీలించారు .ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ అమ్మడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని వెంటనే ఆ పుస్తకాల రూం ను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల ఎంఈఓ సురేష్ , వారి సిబ్బంది విజయ్ ,వెంకటేష్ పాల్గొన్నారు.