మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోకి చేరిన మురుగునీరు

Sep 8, 2024 - 21:32
Sep 8, 2024 - 22:05
 0  1
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోకి చేరిన మురుగునీరు

 తుంగతుర్తి సెప్టెంబర్ 8 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మురుగునీరు దర్శనమిస్తుంది.తేలికపాటి వర్షానికి కార్యాలయంలోకి మురుగు నీరు పేరుకుపోయి దర్శనమిస్తుంది.అధికారులకు స్థానిక ప్రజలు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని వెల్లడించారు.మురుగునీరు చేరడం వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నామని, టైఫాయిడ్ మలేరియా తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.