పోస్టల్ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ

అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి..
సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు..