పోస్టల్‌ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ

May 30, 2024 - 19:35
 0  9
పోస్టల్‌ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ

 అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి..

సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333