నూతన పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన:డిజిపి...
జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్. మండల కేంద్రంలో 2 కోట్ల 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్ కు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా జితేందర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు.