దాతృత్వం చాటుకున్న అజయ్ జనసేన

Sep 9, 2024 - 18:37
Sep 9, 2024 - 18:48
 0  27
దాతృత్వం చాటుకున్న అజయ్ జనసేన

ఖమ్మం వరద బాధితులకు భారీగా అన్నప్రసాద వితరణ:-గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలకు గురై ఇబ్బందులు పడుతున్న ఖమ్మం వరద బాధితులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు అజయ్ జనసేన తెలిపారు. 500 మంది వరద బాధితులకు అన్నప్రసాదం తయారు చేసుకొని ఖమ్మంలో అందజేసేందుకు సూర్యాపేట నుంచి సోమవారం బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సారిగా వర్షాలు రావడంతో వరదలతో ఖమ్మం పట్టణం మునిగిపోయి ప్రజలు కట్టు బట్టలు,  తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయాన్ని తెలుసుకున్న నేను నాకు తోచిన విధంగా ఏదైనా చేయాలని తలచి స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గోకుల రవీందర్ రెడ్డి సూచనల మేరకు 500 మంది బాధితులకు అన్న ప్రసాదం తయారు చేసినట్లు తెలిపారు.ఈ అన్న ప్రసాదాన్ని వరద బాధితులకు అందజేసి వారి ఆకలిని తీర్చడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామన్నారు. దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఖమ్మం ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ, షేక్ సమీర్,  మధు,  ఎల్లయ్య,  కిరణ్, వంశీ, సాయి, ఆదర్శ్, వీరబాబు, మజీద్ తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333