తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పై కల్తీ గురించి
ఇష్టానుసారంగా మాట్లాడుట తగదని""మాజీ హోంమంత్రి శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు
ఏపీ తెలంగాణవార్త ప్రతినిధి:- రాజకీయ పార్టీల నాయకులు తమ పంతాలు పట్టింపులు కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరును ప్రస్తావించడం తగదని సీనియర్ నాయకులు మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు విజ్ణప్తి చేస్తున్నారు. గత కోంత కాలంగా రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తిరుమల లో వేంచేసి ఉన్న ప్రత్యక్ష దైవమైన దేవదేవుడి లడ్డు ప్రసాదం లో జరిగిన కల్తీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు స్పందించారు. రాజకీయ పార్టీల నాయకుల తమ పంతాలు పట్టింపులకు పోయి ప్రతి నిత్యం కల్తీ లడ్డు గురించి మాట్లాడటం తగదని అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రతి నిత్యం ఇదే అంశాన్ని ప్రస్తావనకు తెస్తూ హైందవ దర్మాన్ని బజారు కీడ్చటం పట్ల అయన అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ దేవాలయంగా మన తిరుమల tirumala వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ది చెందగా కోట్లాది మంది స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతి రోజు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని తప్ప చేసిన వారిని వెంకటేశ్వర స్వామి వారు శిక్షించడం మనందరం అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశామని రాజకీయ పార్టీలు కల్తీ లడ్డు విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దని విజ్ణప్తి చేశారు.
తిరుమల వెంకన్న తో పెట్టకున్న వారికి గతంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని నాయకులు సంయమనం పాటించి హైందవ దర్మాన్ని పాటించి భక్తుల మనోభావాలను కాపాడాలని సూచించారు