కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు మృతి..

Apr 4, 2024 - 18:48
 0  76
కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు మృతి..

నిజామాబాద్ ఏప్రిల్ 04 తెలంగాణ వార్త ప్రతినిధి:- కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.ధర్పల్లి మండలానికి చెందిన 10 నెలల బాలుడు గత నెలలో అస్వస్థతకు గురి కాగా ఖలీల్వాడిలోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.ఐదు రోజులు వైద్యం తర్వాత బాలుడి ఆరోగ్యం మెరుగైంది.తీరా డిశ్చార్జి చేసే సమయంలో ఓ ఇంజక్షన్ ఇచ్చారు.ఆ తర్వాత బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సదరు ఆస్పత్రి వైద్యుడు సూచించాడు.హైదరాబాద్ కు తరలించే సమయంలో బాలుడు మృతి చెందాడు. తీరా కుటుంబీకులకు అనుమానం వచ్చి ఇంజక్షన్ గురించి ఆరా తీయగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయమై కలెక్టర్ తో పాటు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం తమకు తప్పుడు బిల్లులు ఇచ్చిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.ఈ విషయంలో కాలం చెల్లిన ఇంజక్షన్లు, మందులు ఇవ్వడం వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333