కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు
సొంత గూటికి చేరుకున్న మాజీ కౌన్సిలర్ డీలర్ శ్రీనివాస్
కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.
జోగులాంబ గద్వాల 29 జనవరి 26 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి మునిసిపాలిటీ చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి శ్రీనివాస్ (డీలర్ శ్రీను) ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో జోగులంబ ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి , వడ్డేపల్లి పట్టణ అధ్యక్షులు చిన్నబాబు, మండల అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి, RDS మాజీ చైర్మెన్ తనగల సీతారామ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.