ఏప్రిల్ 5న మందకృష్ణ మాదిగ సూర్యాపేటకు రాక

ఏప్రిల్ 5న మందకృష్ణ మాదిగ సూర్యాపేటకు రాక ను జయప్రదం చేయండి.
MRPS సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ
సూర్యాపేట, 2 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి* సందర్భంగా స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్* ప్రారంభానికి విచ్చేయుచున్న పద్మశ్రీ "గౌ" మందకృష్ణ మాదిగ* గారికి ఘన స్వాగతం పలకడం కోసం సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు, టౌన్ నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు సంకకు డప్పు వేసుకొని తరలివచ్చి డప్పుల ప్రదర్శన చేయాలి. కావున మనం లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సిద్ధం చేసుకున్న మనం గ్రామాల్లోని డప్పులన్నీటిని తీసుకొని ప్రతి మాదిగ బిడ్డ కదలి వచ్చి మన జీవిత ఆశయమైన మన ముందు 100 తరాలకు బ్రతుకు నిచ్చే వర్గీకరణ సాధకుడు
పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ కి ఘన స్వాగతం పలకాలని ఇట్టి కార్యక్రమానికి రావడానికి సిద్ధం కావాలని డప్పులు లేని వాళ్ళు డప్పుల కొనుగోలు చేసుకోవాలని కార్యక్రమానికి సిద్ధమై సూర్యాపేట దద్దరిల్లేలా మాదిగల డప్పుల ప్రదర్శన శబ్దం వినిపించాలని పేరు పేరునా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.