ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ను సన్మానించిన ఆలకుంట్ల బాలకృష్ణ
నాగారం జూలై 17:- తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జరిపేట జైపాల్ ను నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన, ఐ ఎన్ టి యు సి మరియు వడ్డెర సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ బుధవారం ఆయనను హైదరాబాదులో కలిసి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హాయంలో వడ్డెరలకు గుర్తింపు లభించలేదని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి వడ్డెరలను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి వడ్డెర సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు ఆలకుంట్ల కృష్ణ ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు గొలుసుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.