హైడ్రా బాంబు పేల్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Aug 31, 2024 - 20:22
Aug 31, 2024 - 20:22
 0  3
హైడ్రా బాంబు పేల్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి

జోగులాంబ ప్రతినిధి హైదరాబాద్.

హైదరాబాద్:ఆగస్టు 31.
రాష్ట్రంలో అక్రమ నిర్మా ణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా తన కోసం తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కోసం,పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసమే తెచ్చారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వాక్యానించారు.

శనివారం నాడు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొ రేషన్ పరిధిలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డి అక్కడే ఉన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ తో మాట్లాడు తూ...

జంగన్న హైడ్రా పేరుతో పేదలపై ప్రభుత్వం ప్రతాపం చూపుతుంది జేర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్ళి పేదలకు అన్యాయం జరగకుండా చూడవే అన్న అని అనగా దానికి ప్రతిగా వజ్రెష్ యాదవ్ మాట్లాడు తూ...

హైడ్రా ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టదు ఆక్రమణ దారులు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకుంది అందులో ఎవరికి మినహా యింపులు లేవు అని సమాధానం ఇచ్చారు. 

మద్యలో కలుగజేసుకున్న మల్లారెడ్డి జంగన్న వజ్రెష్ యాదవ్ నాపై ఫిర్యాదులు చేశావ్ కదా అసలు హైడ్రా వచ్చిందే నా కోసం నా అల్లుడు కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం తెచ్చారు. 

అయిన మాకు వంద బిల్డింగ్ లున్నాయి అందులో ఒకటి పోతే నాకేమి నష్టం లేదు హైడ్రా మా పని చేస్తే హైడ్రా పని మేము చూసు కుంటామని మల్లారెడ్డి అన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333