తెలంగాణ విమోచన సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ చేసిన ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 17 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పోలీస్ సంప్రదాయం ప్రకారం పోలీస్ సిబ్బందితో జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన ఎస్సై వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులకులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.