సూర్యాపేట జిల్లాలో  82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ...

Jul 29, 2024 - 20:56
 0  11
సూర్యాపేట జిల్లాలో  82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ...

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్... 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం అమలు జిల్లాలో  రెండు విడతలు కలిపి 82,593 రైతు కుటుంబాలకు  రైతు రుణమాఫీ నిధులు మంజూరయ్యాయని, మొదటి విడతగా లక్ష రూపాయల లోపు 56,217 మంది రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు మంజూరిగాక, సెకండ్ ఫేసులో లక్ష నుండి 1,50,000 వరకు రుణం తీసుకున్న 26,376 మంది రైతు కుటుంబాలకు 250 కోట్లు 30వ తారీఖున రైతులకు వారి ఖాతాలో జమ కానున్నాయని రెండు దఫాలుగా జిల్లాలో రైతులకు రుణమాఫీ కింద 532.78 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెండో విడత రుణమాఫీ పథకం అమలు రేపు ఉదయం 11 గంటలకు సూర్యాపేట లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో జరుగుతుంది కావున రైతులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333