సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన.... వైస్ ఎంపీపీ కొలిశెట్టి పిచ్చి పాపయ్య

Mar 23, 2024 - 18:03
Mar 23, 2024 - 18:38
 0  4
సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన.... వైస్ ఎంపీపీ కొలిశెట్టి పిచ్చి పాపయ్య

మునగాల 23 మార్చి 2024  తెలంగాణ వార్తా ప్రతినిధి :- సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 25 వేల రూపాయల చెక్కును వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య బాధితులకు అందజేశారు. మునగాల మండల కేంద్రానికి చెందిన రాయల శేషయ్య అనారోగ్య కారణాలవల్ల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన్నారు. ఇట్టి సమాచారాన్ని కోదాడ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి తెలియజేయగా వెంటనే సీఎం సహాయ నిధి నుండి 25 వెయ్యి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు వరంలా మారాయని పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేనెపల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State