సమయపాలన పాటించని ఆర్టీసీ సిబ్బంది సమయానికి రాని బస్సులు

అవస్థలు పడుతున్న విద్యార్థులు మరియు ప్రయాణికులు

Nov 7, 2024 - 12:00
 0  17
సమయపాలన పాటించని ఆర్టీసీ సిబ్బంది సమయానికి రాని బస్సులు

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల రాయచూరు రూట్ బస్ ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే.  సమయానికి బస్సులు నడపకపోవడం తో ఇలా విద్యార్థులు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇలాగే సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు మరియు ప్రయాణికులు ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు మరియు ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు .
ఇప్పటికైనా ఆర్టీసీ డిఎం స్పందించి సమయానికి బస్సులు నడపాలని ప్రయాణికులు మరియు విద్యార్థులు కోరుతున్నారు 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333